అనారోగ్య కరమైన చిరుతిండ్లు మానేయండి మరియు ఆయుర్వేదాన్ని అనుసరించండి

విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, హానికరమైన తిండ్లు నిషేధించాలని ఇటీవల యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ తీర్మానం చేసింది మరియు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చైనీస్ మరియు ఇతర హానికరమైన తిండ్లు విక్రయించే ఆహారపు బండ్లు తొలగించబడతాయి అని నిర్ధారించింది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరిపాలకులు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ప్రశంసనీయం. అయితే, ఇది విద్యార్థుల జీవితం నుండి హానికరమైన తిండ్లును తొలగించలేదు. అందువల్ల ఇది దేశంలో ఎక్కడా కూడా రోడ్డు ప్రక్కన హానికరమైన తిండ్ల బండ్లు ఏర్పాటు చేయకుండా పరిపాలకులు నిర్ధారించి కఠినంగా అమలుచేయాలి.

రోడ్డు ప్రక్కన బండ్లపై తిండ్లు ఆరోగ్యానికి హానికరం. వేర్వేరు పరిశోధనల ద్వారా నిరూపించబడినట్లుగా, ఇది తెలివిని బలహీనపరుస్తుంది, శరీరంలో అనవసరమైన వాయువు మరియు కొవ్వు పేరుకుపోతుంది మరియు బద్ధకం కలిగిస్తుంది. నేడు యువత మాత్రమే కాదు, పాఠశాల పిల్లలు కూడా దీనికి బలైపోతున్నారు. సాత్విక మరియు పోషకమైన ఆహారాన్ని తినే అలవాటు నెమ్మదిగా తగ్గిపోతోంది మరియు హానికరమైన తిండ్ల అలవాటు పెరుగుతోంది. హానికరమైన తిండ్లు ఆపివేయవలసి వస్తే విశ్వవిద్యాలయంలో దీనిని నిషేధించడం ద్వారా ఎక్కువ సాధించలేము ఎందుకంటే విద్యార్థులు ఈ ఆహారాన్ని ఇతరమైన ప్రదేశాలలో తినవచ్చు. అందువల్ల వాటిని దేశవ్యాప్తంగా నిషేధించాల్సిన అవసరం ఉంది.

రోడ్డు ప్రక్కన బండ్లపై హానికరమైన తిండ్ల ద్వారా కొత్తతరం ప్రలోభాలకు లోనవుతుంది, ఇది శారీరక బలంతో పాటు మానసిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. శరీరానికి ఈ హానికరమైన తిండ్ల ప్రభావంతో తీవ్రమైన వ్యాధులు సంభవిస్తున్నాయని తెలిసినప్పటికీ ‘ఫలహార తత్వశాస్త్రం’ చాలా నిరక్ష్యం చేసింది. దీనికి కారణం ఈ జీవితం ఉన్నది ఆనందించడం కోసం మాత్రమే అనే ఆలోచనా దృక్పథం. ఈ రోజు ఆహారం అంటే పరబ్రహ్మ స్వరూపం (దైవత్వం ) అనే భావన తెలియదు. భౌతిక శరీరాన్ని పెంపొందించడానికి ఆహారం అవసరమని ఆయుర్వేదం చెబుతుంది. ఆహారాన్ని తినడం యఙ్ఞ కర్మ లాంటిదని హిందూ ధర్మం బోధిస్తుంది. ఆధ్యాత్మిక సాధన చేయటానికి భౌతిక శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని కూడా ఇది బోధిస్తుంది. కానీ ఈ రోజు ఈ ఉన్నతమైన బోధన మరచిపోయినట్లుంది. మనిషి తన ఆహారం కోరికను తీర్చుకోవడానికి హానికరమైన తిండ్లు సృష్టించాడని చెప్పడం తప్పు కాదు. సంపద ఉన్నప్పటికీ అనారోగ్యకరమైన ఆహారం తినాలనే కోరిక అనారోగ్యకరమైన మనస్సును సూచిస్తుంది.

దీనికి మంచి పరిష్కారం హానికరమైన తిండ్లను నివారించడం మరియు ఆయుర్వేదాన్ని అంగీకరించడం. ఆయుర్వేదం, సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరం చురుకుగా ఉండటం మాత్రమే కాకుండా, మనస్సు మరియు తెలివిని బాగా వృద్ధిచేసుకోవడానికి దోహదపడుతుంది అని తెలియజేస్తుంది. మనిషి ప్రవర్తన తినే ఆహారానికి అనుగుణంగా ఉంటుందని అంటారు. మీరు ఆరోగ్యకరమైన మనస్సు, తెలివి మరియు శరీరం కావాలంటే మీరు మంచి ఆహారం తినాలి. కాబట్టి ఆహారం పోషకమైనది కావాలంటే నేల సారవంతమైనదిగా ఉండాలి. హానికరమైన తిండ్ల యొక్క ఈ ఉచ్చు నుండి బయటపడటానికి రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని నిరుత్సాహపరచాలి. దీని కోసం నేటి రాజకీయ నాయకులు కృషి చేయాలి. అప్పుడే ఆరోగ్యకరమైన మరియు నిజంగా పరిణతి చెందిన తరం సృష్టించబడుతుంది.

– శ్రీమతి ప్రజక్త పుజార్, పూణే

 

సూచన : దైనిక సనాతన ప్రభాత్

Leave a Comment